మెదక్, ఆగస్టు- 4 ( ఆదివారం)
రైతే దేశానికి వెన్నుముక జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
స్వయంగా వరి నారు మోసి పొలంలోకి దిగి వరి నాట్లు వేసిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు
రైతులతో ప్రేమగా మాట్లాడిన కలెక్టర్
ఆదివారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ ఆనుకుని ఉన్న ఔరంగాబాద్ గొల్ల నారాయణ రైతు పొలంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు వారాంతంలో ఇద్దరు పిల్లలను తీసుకుని రైతులతో కలిసి వరి నాట్లువేశారు.
. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు సుమారుగా70,000 రైతులకు గాను 447 కోట్ల రైతు రుణమాఫీ నిధులు ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందని తెలిపారు.
లాభదాయక సాగు చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని అందుకు తోడ్పడునివ్వడానికే పెద్ద ఎత్తున రుణమాఫీ చేసిందని రైతులకు వివరించారు.
నారు మడి నుంచి పంట అమ్మకం వరకు ప్రతి దశలో రైతుకు అండగా ఉంటూ అవసరమైన సలహాలు, సూచనలు అందజేసి రైతు లాభదాయక సాగు చేసే దిశగా అధికారులు పని చేయాలని ఆదేశించారు. వరి నాట్లు వేస్తున్న రైతుల పొలాలను పరిశీలించి, సాగు పద్ధతులను, పంటలో వచ్చే లాభం, సాగులో ఎదురవుతున్న ఇబ్బందులు, తదితర అంశాలపై రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.