Friday, January 24, 2025

మెదక్ జిల్లా:బైక్ దొంగలను పట్టుకున్న చేగుంట పోలీస్ లు




*15బైకులను,దొంగ ను పట్టుకొని రిమాండ్ చేసినట్టు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్ పి ఉదయ్ కుమార్*


మెదక్ జిల్లా చేగుంట పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్ పి ఉదయ్ కుమార్ నేడు పత్రిక సమావేశం ఏర్పాటు చేసి తాను మాట్లాడుతూ అంతర్ రాష్ట్ర బైక్ దొంగలను చేగుంట ఎస్ఐ బాలరాజు తన సిబ్బంది తో కలిసి మసాయి పేట్ గ్రామ శివారులో శేరి పంజాబీ ధాబా దగ్గర రోడ్డు పై వాహనాలు తనకి చేస్తుండగా మోతి జనార్దన్ (21) మసాయి పేట్ నివాసి అతను తన బైక్ పై TS 15EB0298,మసాయి పేట్ నుండి చేగుంట కు వెల్లుచుండగా తనిఖీ చేస్తుండగా అతన్ని పట్టుకొని విచారించగా తాను జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలని ఆలోచనతో బైక్ దొంగతనాలు అలవాటు పడినట్లు పోలీసులు తన విచారణలో తెలిపారు,  అతని దగ్గర 15 బైక్, లను స్వాధీన పరుచుకొని , దొంగను కోర్టుకు రిమాండ్ చేసినట్లు  వెల్లడించారు ఈ కార్యక్రమంలో మెదక్ ఎస్ పి, ఉదయ్ కుమార్,తూప్రాన్ డి ఎస్ పి, వెంకట్ రెడ్డి, రామాయంపేట సి ఐ వెంకట్ రాజా గౌడ్, చేగుంట ఎస్ ఐ బాలరాజు, హెడ్ కానిస్టేబుల్ సత్యయ, కానిస్టేబుల్ వెంకటేష్, జీ, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular