
తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం.
మొoడ్రాయి గ్రామానికి చెందిన సంగెం మండల బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు పెండ్లి పురుషోత్తం రెడ్డి మాతృమూర్తి పెండ్లి కొమురమ్మ ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షులు మైనాల నరేష్ మంగళవారం రోజు వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలుపుతూవారికి మనోదైర్యంచెప్పారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ అధ్యక్షులు చిర్ర సుమన్ గౌడ్, బిఆర్ఎస్ యువజన నాయకులు గువ్వ రాజేష్, పోశాల ప్రవీణ్, ఐలోని అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.