ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముళ్ళపాడు గ్రామం.
యన్టీఆర్ జిల్ల పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు గ్రామ సచివాలయం పరిధిలో కిశోర వికాసం శిక్షణ కార్యక్రమం – 2 ” వ సెక్షన్ లో భాగంగా మంగళవారం రోజున సీడీపీఓ . లక్ష్మీ భార్గవి వారి ఆధ్వర్యంలో సూపర్వైజర్ ఉషారాణి వారి సౌజన్యంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో రుతుక్రమం పరిశుభ్రత మరియు లైంగిక విద్య పై కిషోరి బాలికలకు పూర్తి అవగాహన కల్పించారు.Anm. వెంకట రమణ వ్యక్తిగత పరిశుభ్రత గురించి మరియు సానిటరీ ఫ్యాట్స్ ఉపయోగించే విధానము ఉపయోగించిన తర్వాత పాటించవలసిన నియమాల గురించి అవగాహన కల్పించారు. వివిధ రకాల కార్యక్రమాల ద్వారా పిల్లలకు అవగాహన కల్పించడం జరిగింది. వాళ్లలో ఉన్న నైపుణ్యాలను పిల్లలు డ్రాయింగ్,డాన్స్ , కోలాటం ఆట – పాటలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు జ్యోతి , నిర్మల రాణి, ధనలక్ష్మి మహిళా సంరక్షణ కార్యదర్శి నాగలక్ష్మి , కిషోరి బాలికలు పాల్గొన్నారు .
ముళ్ళపాడు గ్రామం లో కిశోర వికాసం శిక్షణ
RELATED ARTICLES