Wednesday, February 5, 2025

మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య కారు ఢీ.. మహిళా దుర్మరణం

తేజ న్యూస్ టివి ప్రతినిధి

వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య మరో వివాదంలో చిక్కు కున్నారు. తాటికొండ రాజయ్య కారు ఢీకొని శనివారం రాత్రి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది
వరంగల్ జిల్లా కాజీపేట మండలం మడికొండ వద్ద ఈ ఘటన చోటుచేసుకుం ది. కలకోట్ల స్వప్న (40) అనే మహిళ రోడ్డు దాటుతుండ గా అతి వేగంగా దూసుకువచ్చిన రాజయ్య కారు ఢీకొట్టడంతో స్వప్నకు తీవ్రగాయాలు అయ్యాయి.
దాంతో ఆమె అక్కడిక్కడే మరణించగా. ప్రమాదం అనంతరం రాజయ్య కారులో నుంచి కిందికి దిగి రక్తపు మడుగులో పడి ఉన్న మృతురాలిని చూసి వెళ్లిపోయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి
కాజీపేటలోని బాపూజీ నగర్‌లో తన కారును వదిలేసి మాజీ ఎమ్మెల్యే రాజయ్య వెళ్లిపోయినట్టు సమాచారం. కారు ఢీకొట్టిన సమయంలో నడిపింది ఎవరు అనేది స్పష్టతరాలేదు
స్థానికుల సమాచారం మేరకు.. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular