శివరాత్రి సందర్బంగా శిల్పా నేచర్ హోమ్స్ నందు మహిళలకు ఇసుకలో నడక పోటీలు జరిగాయి. సుమారు 40 మహిళలు ఈ పోటీలలో పాల్గొన్నారు.50 సంవత్సరాల లోపు విభాగం లో మాధురి, షేక్ నశిమూన్, 50సంవత్సరాల పైబడిన విభాగం లో ప్రమీలమ్మ విజేతలుగా నిలిచి బహుమతులందుకున్నారు.
ఈ కార్యక్రమం లో సునీత, సుధ, ఉమ, రాజేశ్వరి మొదలగు వారు ఎంతో ఉచ్చాహంగా పాల్గొన్నారు. అహోబిలా ప్రైమ్ నేచర్ హోమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం లో డాక్టర్. రామగోపాల్ రెడ్డి నడక వలన వచ్చే లాభాలు మరియు ఆరోగ్యం కొరకు ఆహారంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలియజేసారు.