Thursday, May 22, 2025

భూ భారతి చట్టంతో భూ సమస్యలకు సత్వర పరిష్కారం -మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్ జిల్లా చేగుంట పట్టణ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన భూభారతి – చట్టం ద్వారా భూ సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని, ఇకనుంచి రైతులకు భూములకు సంబంధించిన ఇబ్బందులు ఉండవని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో లోని భూభారతి నూతన చట్టం పై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూతన భూభారతి చట్టం 2025 ద్వారా రైతులకు ఉచిత న్యాయ సేవలు, అందుబాటులో ఉన్నాయని, తమ సమస్యను దరఖాస్తు చేసుకునే సౌకర్యం ఉందని, వివిధ స్థాయిలో నిర్ణీత సమయాలలో దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతుకు న్యాయం చేయడం జరుగుతుందన్నారు. త్వరలో గ్రామసభలు నిర్వహించి రైతుల నుండి తమ సమస్యలు, విజ్ఞప్తులను స్వీకరించడం జరుగుతుందన్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం గ్రామ పరిపాలన అధికారి, మండల సర్వేయర్లను నియమించి తద్వారా క్షేత్రస్థాయిలో నూతన రికార్డుల నిర్వహణకు సులభతర చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, తూప్రాన్  ఆర్డీవో జయచంద్ర రెడ్డి, తాసిల్దార్  శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్, కిసాన్ సెల్ అధ్యక్షుడు చౌదరి శ్రీనివాస్, ఎం శ్రీనివాస్, జనరల్ సెక్రెటరీ కొండి శ్రీనివాస్, ముజామిల్, బాల్ రెడ్డి, బుర్ర ఆగం, భాగ్యరాజ్, జూకంటి రాజు గౌడ్, సోమ వెంకటేష్, మోహన్ నాయక్, రైతులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular