TEJA NEWS TV జనసేన పార్టీ
ఎన్టీఆర్ జిల్లా
నందిగామ నియోజకవర్గం.
భారతదేశ ప్రగతికి బాటలు వేసిన మహా మనిషి..ప్రఖ్యాత శాస్త్రవేత్త, మాజీరాష్ట్రపతి, భారతరత్న, డాక్టర్ అవుల్ పకీర్ జైనూలబ్దీన్ అబ్దుల్ కలాం’ జయంతి సందర్భంగా నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున ఘన నివాళులు అర్పించిన నందిగామ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి గారు.
కంచికచర్ల పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు జనసేన మండల నాయకులు జనసైనికులు వీర మహిళలతో కలిసి డాక్టర్ అబ్దుల్ కలాం గారికి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా తంబళ్ళపల్లి రమాదేవి మాట్లాడుతూ ఇంటింటికి పేపర్ వేసే స్థాయి నుండి రాష్ట్రపతిగా ఎదిగిన నేటి తరం వారికి మార్గదర్శిగా నిలిచిన గొప్ప మహనీయుడు
ఏపీజే అబ్దుల్ కలాం గారని, అలాంటి వారి జయంతిని పురస్కరించుకుంటూ పూలమాలతో సత్కరించి నివాళులర్పించి, ఆయన గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటూ… ఆయన మరణించే సమయానికి ఆయన సంపద 3 పాంట్లు, 6 షర్టులు, 3 సూట్లు,1 వాచ్, 2500 పుస్తకాలు, సైంటిస్ట్స్ కమ్యూనిటీ బెంగళూరు వారు ఆయనకు ఎప్పుడో ఇచ్చిన ఒక ఇల్లు, దాదాపు 144 మంది కోట్ల భారతీయుల ప్రేమాభిమానాలు, ఇలాంటి వారి గొప్పదనాన్ని ఏమని వర్ణించగలము? వారి స్పూర్తిని మరింతమందికి తెలియజెప్పి, వారి దారిలో కొందరైనా నడిస్తే అదే మనం వారికి ఇవ్వగలిగే సరైన నివ్వాలని అన్నారు.
నిగర్వి , నిరాడంబరుడు, అపరమేధావి, మాజీరాష్ట్రపతి, భారతరత్న డాక్టర్, ఏపీజే అబ్దుల్ కలాం గారి 93వ జయంతి సందర్భంగా భారతదేశ పౌరులుగా ఘన నివాళులర్పిస్తున్నామన్నారు…. తదనంతరం కంచికచర్ల మండల నాయకులు కంచికచర్ల పట్టణంలోని సత్రం బడి పాఠశాలలోని విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో
భారతదేశ ప్రగతికి బాటలు వేసిన మహా మనిషి అబ్దుల్ కలాం – తంబళ్ళపల్లి రమాదేవి
RELATED ARTICLES