భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
21-04-2025
భద్రాచలం: తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత , బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర సోమవారం ఉదయం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, శ్రీ లక్ష్మి తాయారమ్మ ఆలయంలో ఆశీర్వచనాలు అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు, రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు చంద్రవంతి, హరిప్రియ నాయక్ తదితర బీఆర్ఎస్ నాయకులు, ఉద్యమకారులు, జాగృతి కార్యకర్తలు పాల్గొన్నారు.


