Thursday, May 22, 2025

బెల్ట్ షాపుల దందా — ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యం….వైన్ షాపు నుంచి బెల్ట్ షాపు వరకూ — ఓపెన్ రవాణా

రాజకీయ నేతల庩 అండతో బెల్ట్ షాపుల దూకుడు

ఒక్క మండలానికి సరిపడే టెండర్‌తో రెండు మండలాల్లో మద్యం వ్యాపారం జరుగుతుండటం రాజకీయ అండకు నిదర్శనంగా భావిస్తున్నారు. ఎటూరునాగారం మాత్రమే కాకుండా పక్క మండలమైన మంగపేటలోనూ మద్యం విక్రయాలు బూసుగా సాగుతున్నాయి.

ప్రజల ఆవేదన — “మూడు శుక్రవారాలకే మారిపోయారా సారు?”

బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాల్సిన ఎస్‌ఐ, సమాచారాన్ని ఇచ్చిన పాత్రికేయుడిపైనే వేధింపులకు పాల్పడటం, మండల ప్రజల్లో ఆగ్రహావేశాలు పెంచింది. ‘‘ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి బెల్ట్ దందాను అరికట్టాలి’’ అని ప్రజలు బహిరంగంగా డిమాండ్ చేస్తున్నారు.

TEJA NEWS TV TELANGANA :ములుగు జిల్లా ఎటూరునాగారం మండల కేంద్రంలో మద్యం అక్రమ రవాణా మరియు బెల్ట్ షాపుల ద్వారా విక్రయాలు తీవ్రమవుతున్నప్పటికీ సంబంధిత ఎక్సైజ్ ఎస్‌ఐ పనితీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. గత మూడు వారాలుగా విధులకు హాజరుకాని ఆయన, బెల్ట్ షాపుల సమాచారం ఇచ్చిన విలేకరిపై ఫోన్‌లో దురుసుగా స్పందించడం మండల ప్రజల ఆగ్రహానికి దారితీసింది.

వైన్ షాపు నుంచి బెల్ట్ షాపు వరకూ — ఓపెన్ రవాణా

మద్యం బెల్ట్ షాపులకు తరలిపోతున్న విషయాన్ని తేజ న్యూస్ విలేకరి ఎక్సైజ్ అధికారులకు తెలపగా, స్పందన బదులు ప్రశ్నలకు జవాబులే లేని స్థితి కనిపించింది. ఈ పరిస్థితులు చూసిన ప్రజలు, ఎస్సై ఇప్పటికే బెల్ట్ దందాదారులతో మమేకమైనారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల పిలుపు — మద్యం వ్యసనానికి పాల్పడుతున్న వారికి రక్షణ కాదు, మార్గదర్శనం కావాలి

ఈ బెల్ట్ వ్యాపారాల వలన రోజువారీ కూలీల జీవితం అతలాకుతలం అవుతోందని, ఇది ఇకపై కొనసాగితే యువత తారసపడే భవిష్యత్తు మసకబారుతుందని ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెల్ట్ షాపుల నిర్మూలనకు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular