TEJA NEWS TV TELANGANA
నేడు బీబీపేట మండల శాఖ *క్రీడా భారతి ఆధ్వర్యంలో* బీబీపేట పట్టణంలో అండర్ 19 వాలి బాల్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉదయం వక్తగా విచ్చేసిన కదిరే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా క్రీడ భారతి ఆధ్వర్యంలో యువతను జాగృతం చేయడంతోపాటు.. క్రీడల వైపు యువతను మళ్లించాలని, యువతలో దేశ భక్తి ని నిర్లిప్తం చేయడానికి క్రీడాభారతి అట నిర్వహి స్తుందని తెలిపారు…బీఈడీ కళాశాల మచ్చేందర్ డా. సంతోష్ గౌడ్ లు మాట్లాడారు…
ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమై అతిధులు హాజరై
టాస్ వేసి క్రీడలను ప్రారంభించారు…
సాయంత్రం మొదటి బహుమతి తుజాల్పూర్, ద్వితీయ బీబీపేట క్లబ్ జట్టు, తృతీయ మహాత్మ జ్యోతిబాపూలే బిబిపేట జట్టు బహుమతులను సాయంత్రం బహుమతి ప్రధానోత్సవం లో భాగంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన బిబిపేట ఎస్సై ప్రభాకర్ గారు మాట్లాడుతూ… ప్రపంచంలో అత్యధిక యువత మన భారత్ దేశంలో కలిగి ఉన్నారని.. ప్రపంచ దేశాలు భారత్ యువత పైపే ఆశగా చూస్తున్నారని.. భవిష్యత్తులో ప్రపంచానికి భారత యువతని నిర్దేశించే పరిస్థితికి భారతదేశం ఎదగబోతుందని… ఎస్సై ప్రభాకర్ గారు తెలిపారు… చదువుతోపాటు క్రీడలు కూడా ప్రస్తుతం యువతకు చాలా అవసరమని స్పష్టం చేశారు.. అనంతరం ఎస్సైను శాలువాతో సత్కరించి విజేతలకు బహుమతులు అందజేశారు…
ఈ కార్యక్రమంలో డాక్టర్ తంగళ్ళపల్లి సంతోష్ గౌడ్, నిర్వాహకులు ఎల్లమైన హరీష్, దిటి బాలకృష్ణ, గుర్రాల నవీన్ పోసు శివకుమార్, మామిడాల రమేష్, నవీన్ కొట్టే, చిట్టా బోయిన నరేష్… వడ్నాల భాస్కర్, ఉప్పు రాజు తదితరులు పాల్గొన్నారు.
బీబీపేట్ వాలీబాల్ పోటీలలో విజయం
RELATED ARTICLES



