Friday, January 24, 2025

బిబిపేట వాసికి రాష్ట్రస్థాయి పురస్కారం

కామారెడ్డి జిల్లా కేంద్రంలోగల, “డైరీ కళాశాలలో” ఈరోజు జరిగిన, “సమాచార హక్కు చట్టం రాష్ట్ర అవగాహన సదస్సు జరిగింది” ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా,రాష్ట్ర అధ్యక్షులు, కార్యదర్శి ,మరియు ఆర్టిఐ రాష్ట్ర డైరెక్టర్ ఏం .ఏ. సలీం గారు కూడా విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు రాజన్న, రాష్ట్ర డైరెక్టర్ సలీం. మాట్లాడుతూ బీబీపేటకు చెందిన కొంగరి M.నాంపల్లి గారు సమాజానికి చేసినటువంటి నిస్వార్థ సేవలను గుర్తించి.RTI, చట్టం పట్ల అవగాహన కల్పించుట, విద్యాహక్కు చట్టం పై అవగాహన, బాల్యవివాహాల నిర్మూలన చట్టం గూర్చి, సైబర్ క్రైమ్ నేరాల గూర్చి అవగాహన కల్పించుట, చట్టాలను ప్రతి ఒక్కరు గౌరవించాలని అవగాహన కల్పించుట, వంటి అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేసినందుకుగాను ఈరోజు ఆర్టిఐ రాష్ట్ర కమిటీ తరఫున, బెస్ట్ “సోషల్ వర్కర్ అవార్డును” ప్రధానం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ షబానా బేగం. శ్రీనివాస్. ఆయా మండలాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular