Wednesday, February 5, 2025

బిబిపేట్ : బీడీ కార్మికులకు జీవన భృతి చెల్లించాలి

TEJA NEWS TV : 2014,సంవత్సరం కటాప్ తేదీని తొలగించి, ఎలాంటి షరతు లు లేకుండా బీడీ పరిశ్రమ లో పనిచేయు అందరికీ రూ,4016 జీవన భృతి ఇవ్వాలని, బీబీపేట్  లో బారీ ర్యాలి,MPDO, ఆఫీసు ముట్టడి …
         ఈ రోజు కామారెడ్డి జిల్లా బీబీ పేట్ మండల కేంద్రం  బస్టాండ్  దగ్గర మార్కండెయ  మందిర్ నుండి,భారీ ర్యాలి,యం,పీ,డి,ఓ,ఆఫీసు ముట్టడి,అనంతరం తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ, శ్రామిక శక్తి బీడీ వర్కర్స్ యూనియన్, ఎఐఎఫ్ టీయూ, ఆద్వర్యంలో బీడీ పరిశ్రమలో పనిచేయు కార్మికుల అందరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 2014,పిబ్రవరి 28,తేదీ కటాఫ్ తేదీని తొలగించి ,2016,ల జీవన భృతిని 4016,రూ,లకు పెంచి ఇవ్వాలని ఈ రోజు బీబీ పేట్ మండల కేంద్రం లో  బారీ ర్యాలి ,యం,పిడీఓ,ఆఫీసు,కు అనంతరం యం,పి,డీఓ,ఆపీసు, ముట్టడి చేసి , యం, పి,డిఓ ,గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది,
      అనంతరం తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ, రాష్ట్ర అధ్యక్షులు, యస్, సిద్దిరాములు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, యం, ఆంజనేయులు,రాష్ట్ర నాయకులు, నగరపు యెల్లయ్య, శ్రామిక శక్తి బీడీ వర్కర్స్ యూనియన్, ఎఐఎఫ్ టీయూ, రాష్ట్ర అధ్యక్షురాలు ,అనూసుయ,రాష్ట్ర నాయకురాలు,,వెంకట లక్ష్మి, కుర్తి లింగం,మాట్లాడుతూ….
తెలంగాణ రాష్ట్రములోని కాంగ్రెస్ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికలలో బీడీ కార్మికులకు ఇచ్చిన హామీ నేటికి అమలు చేయ నందున ఈ రోజు బీడీ కార్మికులు రోడ్డుప్తె ఆందోళన చేయడం జరుగుతుంది, బీడీ కార్మికుల ఓట్లు తో అధికారం లోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీడీ కార్మికులకు ఇచ్చిన హామీ అమలు చేయకపోవడం సిగ్గు చేటు,ఇప్పటికీ క్తె ఎలాంటి షరతులు లేకుండా 4016,రూ,ల జీవన భృతి బీడీ పరిశ్రమ లో పనిచేయు, బీడీ కార్మికులకు ప్యాకర్లకు,బట్టి, చటన్ తదితరులకు ఇవ్వాలని లేనిచో రానున్న స్ధానిక ఎన్నికలలో బీడీ కార్మికులు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు,
      కేంద్రం ప్రభుత్వం బీడీ పరిశ్రమ ప్తె లేనిపోని ఆంక్షలు ,కోప్టా చట్టం పెట్టడం,GST,పెట్టడం మూలంగా బీడీ కార్మికులకు చేతినిండా పనిలేదు, నేలలో 10,రోజు పనిలేదు, దీనిద్వారా బీడీ కార్మికులకుటుంభలు తీవ్ర ఆర్దిక ఇబ్బందులు పడుతున్నారు, అందుకని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 4016,రూ,ల,జీవన భృతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు,
   ఈ కార్యక్రమం
తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ, రాష్ట్ర,ప్రధాన కార్యదర్శి, యం, ఆంజనేయులు, రాష్ట్ర నాయకులు, నగరపు యెల్లయ్య, రాష్ట్ర కోషదికారి స్తెయ్యద్,కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు, జిల్లా నాయకులు, నాంపల్లి,,,శ్రామిక శక్తి,బీడీ వర్కర్,యూనియన్,రాష్ర్ట నాయకులు, కుర్తి లింగం,బిఎల్ టీయూ జిల్లా నాయకులు,గంగాదర్,యస్,రాంచేంద్రం,లక్ష్మి నారయణ,శివనందం,నర్సింలు,శంకర్,రోజా,లక్మ్షితదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular