చేగుంట మండల కేంద్రానికి చెందిన గోరంట్ల వెంకటేశం ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన విషయం తెలుసుకున్న చేగుంట తాజా మాజీ సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రమాదం జరిగిన వివరాలను అడిగి తెలుసుకుని మృతి చెందిన వెంకటేశం దశదిన కర్మ కోసం తన వంత సాయంగా 4000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మంచుకట్ల శ్రీనివాస్ తో పాటు పద్మశాలి సంఘం అధ్యక్షులు మ్యాకల రవికుమార్, మ్యాకలనాగరాజు,తుమ్మ యాదగిరి కర్రె నరేష్,తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన తాజా మాజీ సర్పంచ్ మంచుకట్ల శ్రీనివాస్
RELATED ARTICLES