కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి ఆదేశాల మేరకు అన్ని మండలాల్లో జెండా ఆవిష్కరణ జరగాలని ఆదేశాలతో పెద్దకడుబూరు మండలంలో జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించడం జరిగింది.
పెద్దకడబూరు మండల కేంద్రంలో, తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగు ప్రజల ఆరాధ్యదైవం నందమూరి తారక రామారావు 1982, మార్చి 29న ప్రారంభించారు. అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షముగా పాలిస్తున్న కాంగ్రేసు పార్టీకి ప్రత్యమ్నాయముగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయముతో స్థాపించాడు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఇంద్రసేనారెడ్డి, నీలకంఠ రెడ్డి, దశరథ రాముడు మబ్బు ఆంజనేయ, కటికే మహబూబ్ సాబ్, ఐ టిడిపి నాయకులు కురువ కృష్ణ, ఐ టిడిపి నాయకులు ఎండి. షఫీ, దస్తగిరి, రంగన్న, యోహన్, బడుగు బలహీన వర్గాలు కోసం పనిచేయడానికి పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, పెద్దకడబూర్ బస్టాండ్ ఆవరణలో శనివారం ఉదయం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు, పేద ప్రజలకు సేవ చేయడానికి, బడుగు బలహీన వర్గాలు కోసం ఏర్పాటు చేసిన పార్టీ అని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. రాష్ట్ర అభివృద్ధి,అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం తెలుగుదేశం పార్టీ తోనే సాధ్యం అని వారు అన్నారు. పార్టీ 43 వసంతాలు పూర్తి చేసుకొని 44 వసంతాలుగా అడుగు పెడుతున్న సందర్భంగా కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.