భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
దమ్మపేట:
దమ్మపేట, ఏప్రిల్ : దమ్మపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం జరిగిన వార్షికోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ విద్యార్థులను అభినందిస్తూ, ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి జ్ఞాపికలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “విద్యారంగంలో నూతన అవకాశాలు ఎదురు చూస్తున్న తరుణంలో విద్యార్థులు లక్ష్యాన్ని చేరుకునే దిశగా కృషి చేయాలి,” అని సూచించారు. విద్యార్థుల్లో నైపుణ్యాల అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ప్రోత్సాహాన్నిస్తాయని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఎంఈఓ కీసరి లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

