TEJA NEWS TV :
జనసేన పార్టీ
ఎన్టీఆర్ జిల్లా
నందిగామ నియోజకవర్గం.

నందిగామ పట్టణం కెవిఆర్ కాలేజ్ నందు కేంద్ర ప్రభుత్వ కృత్రిమ అవయవముల తయారీ సంస్థ (ALIMCO), 5 వివిధ ఉపకరణముల పంపిణీ కార్యక్రమంలో భాగంగా దివ్యాంగుల కొరకు వారికి బ్యాటరీ ట్రై సైకిళ్ళు మరియు ట్రై సైకిళ్ళు, పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య మరియు జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తంబళ్ళపల్లి రమాదేవి మాట్లాడుతూ నేడు సమాజంలో అన్ని అవయవాలు బాగున్న మనిషి జీవించడమే కష్టతరంగా ఉన్న సమయంలో దివ్యాంగులు వారి లోపాలను అధిగమించి ఎన్నో గొప్ప విజయాలను సాధిస్తూ అవార్డులను పొందుతూ మాకెంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. అటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము, మా జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దివ్యాంగులకు ఎంతో ప్రాధాన్యమిచ్చే వారని, ఎన్నో కార్యక్రమాలలో వారి వద్దకు స్వయంగా ఆయనే వెళ్లి వారి కోసం కింద కూర్చొని వారితో సంభాషించే వారని, దివ్యాంగులలో ఉన్న ప్రతిభను తెలుసుకొని వారిని ప్రోత్సహించేవారనీ. అటువంటి గొప్ప మనసున్న వ్యక్తి నాయకత్వంలో జనసేనలోని ప్రతి నాయకులు జనసైనికులు ఆయన జాడలోనే నడుస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని రమాదేవి అన్నారు. ఈ కార్యక్రమానికి కూటమి నేతలు, జనసైనికులు, వీర మహిళలు, టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.