Thursday, May 22, 2025

నేటి వార్తల ముఖ్యాంశాలు

TEJA NEWS TV

▪️ మే 2న ప్రధాని మోదీ అమరావతి రాక. రాజధాని పునఃనిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

▪️యూరప్ పర్యటనకు కుటుంబ సమేతంగా సిఎం చంద్రబాబు. ఈనెల 20న 75వ పుట్టినరోజు సందర్భంగా విదేశీ యాత్ర.

▪️నేటి నుంచి 18వరకు రాష్ట్రంలో పర్యటించనున్న 16వ ఆర్థిక సంఘం ప్రతినిధులు. ఈరోజు సచివాలయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి పవర్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్న సీఎం.

▪️రెండు, మూడు రోజుల్లో ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ.. ఆ వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్.. 26న మత్స్యకార భరోసా నిధులు విడుదల.. కేబినెట్లో పలు కీలక నిర్ణయాలు.

▪️2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు మంజూరు. డీఎస్సీ ద్వారా భర్తీ.

▪️పట్టణ డ్వాక్రా మహిళలకు 25 పెట్రోలు బంకులు మంజూరు. ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున కేటాయింపు. ఇందుకు అయ్యే పెట్టుబడి వారి పొదుపు నుంచి ఖర్చు చేస్తారు. స్థలాలు సేకరించాలని పురపాలిక కమిషనర్లకు ఆదేశాలు.

▪️విశాఖలో టీసీఎస్ సంస్థ భారీ క్యాంపస్.. 1370 కోట్ల పెట్టుబడి.. 12 వేల మందికి ఉపాధి. 21.6 ఎకరాలు కేటాయింపుకు కేబినెట్ ఆమోదం.

▪️ఈ ఏడాది నైరుతి రుతుపవన కాలంలో తెలుగు రాష్ట్రాల్లో అధిక వర్షాలు. భారత వాతావరణ శాఖ వెల్లడి.

▪️ అమరావతి, గుంటూరు, విజయవాడ, తాడేపల్లి, మంగళగిరి కలిపి ఇక మెగాసిటీగా రూపకల్పన. సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూసేకరణ.

▪️తెలంగాణ, కాళేశ్వరంలో ఈనెల 15 నుండి 26 వరకు సరస్వతీ నది పుష్కరాలు. ఉత్తరాదిన ప్రయాగ, దక్షిణాదిన కాళేశ్వరంలో మాత్రమే సరస్వతి నది ప్రవహిస్తుంది.

▪️ప్రతి 10 లక్షల జనాభాకు 15 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు.. ఇండియా జస్టిస్ 2025 నివేదిక వెల్లడి. న్యాయం అందిస్తున్న రాష్ట్రాల ర్యాంకింగ్స్ లో కర్ణాటక మొదటి స్థానం, రెండు ఆంధ్రప్రదేశ్, మూడు తెలంగాణ.

▪️లా కమిషన్ చైర్మన్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ దినేష్ మహేశ్వరి.. సభ్యులుగా హితేష్ జైన్ (న్యాయవాది) ప్రో. డి.పి.వర్మ (లా ప్రొఫెసర్) నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర న్యాయ శాఖ.

▪️జపాన్‌ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి బృందం

▪️విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కార్మికుల సమ్మె వాయిదా

▪️తెలంగాణలో వడదెబ్బ మృతులకు రూ.4 లక్షల పరిహారం

▪️తెలంగాణలో 38 జిల్లా అండ్‌ సెషన్స్‌ జడ్జిల బదిలీలు

▪️ఏపీ హజ్‌ కమిటీ చైర్మన్‌గా షేక్‌ హసన్‌ బాషా

▪️కేంద్రం చొరవతో హజ్ పోర్టల్‌ను మళ్లీ తెరవనున్న సౌదీ

▪️రద్దీలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు ప్రపంచంలో 9వ స్థానం

▪️మార్చి నెల ఐసీసీ ఉత్తమ క్రికెటర్‌గా శ్రేయస్ అయ్యర్

▪️ఉత్కంఠ పోరులో కోల్‌కతాపై పంజాబ్‌ విజయం

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular