Monday, January 20, 2025

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో అసలు ఏం జరుగుతోంది..?

TEJA NEWS TV: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో అసలు ఏం జరుగుతోంది..? తమ హత్యలకు అడ్డగా మారిన బాసర ట్రిపుల్ ఐటీ. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థినిలు ఆత్మహత్య
బాసర ఆర్జీయూకేటీలో మరో విషాదం చోటుచేసుకుంది. వరుసగా రెండో రోజు మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం బాసర ట్రిపుల్ ఐటీలో కలకలం రేపింది.రెండురోజులు క్రితం పీయూసీ మెదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని బాత్రూంలో దీపిక మూత్రశాలలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సంఘటన నుంచి తేరుకోకముందే గురువారం వేకువజామున 2 గంటల ప్రాంతంలో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న. లిఖిత(17) అనే విద్యార్థిని వసతి గృహంలోని నాలగవ అంతస్తు నుంచి కిందపడింది. తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేయించిన అనంతరం భైంస ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.అయితే, లిఖిత అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.ఇది ఆత్మహత్య.. లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతానికి బాసర త్రిబుల్ ఐటీ ముందర భారీ పోలీసుల బందోబస్తు. నడమ ట్రిపుల్ ఐటీ అధికారులు మాత్రం ప్రమాదవశాత్తు జరిగిందని చెబుతున్నారు. ప్రమాదమా.. లేక ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు
చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. లిఖిత స్వస్థలం సిద్దిపేట జిల్లా గజ్వేల్, బుర్రలేక ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. లిఖిత స్వస్థలం సిద్దిపేట జిల్లా గజ్వేల్, బుర్ర రాజు, రేణుక దంపతుల పెద్ద కుమార్తె గజ్వేల్ లో మిర్చిబండి నిర్వహిస్తూ.రాజు పిల్లలను చదివిస్తున్నారు.వారం
రోజుల క్రితమే లిఖిత హాస్టలకు వెళ్లిందని..ఇంతలోనే ఇలా జరగడంతో తల్లిదండ్రులు కన్నీటి
పర్యంతమవుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular