నాగుల చవితి సందర్భంగా పాత పాల్వంచలో డీసీఎంఎస్ చైర్మన్, రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ *కొత్వాల శ్రీనివాసరావు* సతీమణి *విమలాదేవి* దంపతులు పుట్టలో పాలు పోసి, పూజలు చేశారు. పాత పాల్వంచ షిరిడి సాయిబాబా దేవాలయం ప్రాంగణంలోని నాగేంద్ర స్వామి దేవాలయంలో మంగళవారం నాగుల చవితి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో *కొత్వాల* తోపాటు వందలాదిమంది మహిళలు, భక్తులు పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ *లోగాని సత్యనారాయణ* , శిరిడి సాయిబాబా దేవాలయం నిర్వాహకులు *ముత్యాల కోటేశ్వరరావు* , భక్తులు తదితరులు పాల్గొన్నారు.
నాగుల చవితి సందర్భంగా పుట్టలో పాలు పోసిన రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల దంపతులు
RELATED ARTICLES