Wednesday, January 22, 2025

నంద్యాల: సి.పి.ఎస్ వద్దు ఓ.పి.ఎస్ ముద్దు – ఎన్ వి భాస్కర్ రెడ్డి

TEJA NEWS TV NANDYAL

ఈరోజు పి ఆర్ టి యు నంద్యాల జిల్లా కార్యాలయం నందు జిల్లా అధ్యక్షుడు రామ పక్కిరెడ్డి అధ్యక్ష తన జరిగిన సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ వి భాస్కర్ రెడ్డి గారు ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించిన సిపిఎస్ రద్దుచేసి అందరికీ ఓ.పి.ఎస్ ను వర్తింపచేయాలని కోరారు ప్రభుత్వంలో 30 సంవత్సరాల పైన సర్వీస్ చేసి జీవితం చివరి దశలో వృద్ధాప్యంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన సమయంలో పెన్షన్ లేకపోవడం చాలా ఇబ్బందికరమైన విషయం ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించి ఓపిఎస్ అమలుపరచవలసిందిగా కోరుతున్నాం అలాగే కేజీవీబీలో వార్డెన్ పోస్టులను నియమించవలసిందిగా కోరుతున్నాం నెలవారి పదోన్నతులను చేపట్టవలసినదిగా కోరుచున్నాము ఈ సమావేశంలో సుదర్శన్ రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆనందప్ప విశ్వనాద్ మొదలగువారు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular