Thursday, May 22, 2025

నందిగామ నియోజకవర్గంలో రక్తదాన శిభిరం ఏర్పాటు

జనసేన పార్టీ,
ఎన్టీఆర్ జిల్లా,
నందిగామ నియోజకవర్గం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధినేత *శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి* పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని  ఈరోజు నందిగామ నియోజకవర్గం వీర్లపాడు మండలం జుజ్జూరు గ్రామం జనసేన పార్టీ నాయకులు బేతనపూడి జయరాజు పసుపులేటి వర కుమార్ అరవింద్ కోటి మరియు జనసైనికులు ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు వారు సంయుక్తంగా రక్తదాన శిభిరం ఏర్పాటు చేశారు.  ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ శాస్త్ర, సాంకేతిక పరంగా ఎంతో అభివృద్ధి చెందిన ప్రస్తుత సమాజంలో మనం సొంతగా తయారు చేయలేనిది ఏదైనా ఉందీ అంటే అది రక్తం ఒక్కటే. మన దేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో ప్రతిఏటా సుమారు ఐదు కోట్ల యూనిట్ల రక్తం అవసరమవుతుందనేది నిపుణుల అంచనా. అయితే రక్తదాతల నుంచి లభిస్తున్నది మాత్రం కేవలం 50 లక్షల యూనిట్లు మాత్రమేనని నివేదికలు తెలియజేస్తున్నాయి. మనదేశంలో ప్రతిరోజు దాదాపు 12 వేల మంది రక్తం దొరకని కారణంగా మరణిస్తున్నారు. గత దశాబ్దకాలంగా రక్తదానం పైన అవగాహనా కార్యక్రమాలు పెరిగాయి. అయినప్పటికీ రక్తదాతల నుంచి వస్తున్న స్పందన మాత్రం ఆ అవసరాలను తీర్చేంత లేవన్నది వాస్తవం. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగాస్టార్ చిరంజీవి గారి కోసం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి కోసం వారి పుట్టినరోజులను పురస్కరించుకొని వారి అభిమానులు జన సైనికులు రక్తదానం లాంటి సామజిక కార్యక్రమాలను చేస్తూ సమాజాసేవ చేస్తున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు మరియు రిటైర్డ్ డిఐజి తంబళ్ళపల్లి రవికుమార్ మూర్తి IPS, తంబళ్ళపల్లి ధీరేంద్ర మండల అధ్యక్షులు బేతపూడి జయరాజు, పసుపులేటి వర కుమార్, కోటి, అరవింద్, శ్రీనివాస్ స్వామి, తోట ఓంకార్, నాయిని సతీష్, బండారుపల్లి సత్యనారాయణ, దేవి రెడ్డి శ్రీనివాస్, మరియు జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular