ఎన్టీఆర్ జిల్లా నందిగామ న్యాయస్థానంలో నూతనంగా ఎన్నికైన న్యాయవాదుల బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ మరియు కౌన్సిల్ సభ్యులు నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవిని నందిగామ పట్టణంలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ యొక్క విధివిధానాలు వారికి నచ్చాయని, జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి అంటే వారికి ఎంతో అభిమానం అని, సామాజిక న్యాయం ప్రతి ఒక్కరికి అందాలనే గొప్ప సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించారని, అటువంటి గొప్ప నాయకుల స్పూర్తితో రాబోవు తరాలకు మంచి నాయకులను ప్రజలకు చేరువయ్యేలా ఆయన చేస్తారని, మా అందరి కోరిక అని తెలియజేశారు. నియోజకవర్గంలోని జనసేన పార్టీ శ్రేణులకు న్యాయపరమైన ఎటువంటి సమస్యలు ఉన్నా సందేహాలు ఉన్నా మేము వారికి సహకరిస్తామని అది మా బాధ్యత అని తెలియపరిచారు. ఈ సందర్భంగా తంబళ్ళపల్లి రమాదేవి మాట్లాడుతూ నందిగామ నియోజకవర్గం లో జనసేన పార్టీ శ్రేణులకు లీగల్ సెల్ అవసరం ఉందని, త్వరలో జనసేన పార్టీ కమిటీలు ఏర్పాటుచేస
నందిగామ : జనసేన పార్టీ సమన్వయకర్త తంబళ్ళపల్లి రమాదేవిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన న్యాయవాదుల బార్ కౌన్సిల్ సభ్యులు
RELATED ARTICLES