
TEJA NEWS TV:
మెదక్ జిల్లా చేగుంట ధాన్యం కొనుగోలు నెమ్మదిగా జరుగుతున్న నేపథ్యంలో తూప్రాన్ ఆర్డీవో జయచంద్రరెడ్డి తహసీల్దార్ కార్యాలయం చేగుంట నందు ఏపీఎం, సీసీ, పిఎసిఎస్ ల సీఈఓస్ , ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇంచార్జీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరగాలని, ఎప్పటికీకప్పుడు కొనుగోలు వివరాలు ట్యాబు లో నమోదు చేసి, రైతుల ఖాతాల్లో డబ్బులు త్వరగా జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. ఈ నెల 15 తేదీ కల్లా ప్రతి గ్రామంలో పీపీసీ లో సిద్ధంగా ఉన్న ధాన్యంను పూర్తిగా కొనుగోలు చేసి, పీపీసీ లు త్వరగా క్లోజ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆకాల వర్షాల వల్ల ధాన్యం తడిసినట్లయితే ,రైతులు దిగులు చెందవలసిన అవసరం లేదని, అట్టి ధాన్యం ను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. లారీల కొరత కొంత ఉంది కావున రైతులు తమ ట్రాక్టర్ ద్వారా ధాన్యం రవాణాను ముందుకు వస్తే అద్దె డబ్బులు చెల్లిస్థామని తెలిపారు. పిఎసిఎస్, సీఈఓ ల పనివిధానం పట్ల అసంత్రుప్తి వ్యక్త పరిచారు, పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇంచార్జీలు చిత్త శుద్ధి తో పనిచేసినట్లయితే సత్ఫలితాలు వొస్తాయని తెలిపారు. ఈ సమావేశంలో తహసీల్దార్ శ్రీకాంత్, డిప్యూటీ తహసీల్దార్ స్వప్న, ఏపీఎం లక్ష్మీ నరసమ్మ, మండల గిర్ధవరులు, పీపీసీ ల ఇంచార్జీలు, పాక్స్ ల సీఈఓ లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు