Wednesday, February 5, 2025

దేవనకొండ:బాధిత కుటుంబానికి 20వేలు ఆర్థిక అందజేసిన మంత్రి తనయుడు యువనేత గుమ్మనూరు ఈశ్వర్

TEJA NEWS TV: నిన్న దేవనకొండ మండల కేంద్రంలో షాట్ సర్క్యూట్ పూరి గుడిసె దగ్ధం

ఆ కుటుంబాన్ని అన్నగా గుమ్మనూరు ఈశ్వర్ సాయం

*బాధిత కుటుంబానికి 20వేలు ఆర్థిక అందజేసిన మంత్రి తనయుడు యువనేత గుమ్మనూరు ఈశ్వర్*

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తనయుడు,యువనేత గుమ్మనూరు ఈశ్వర్ మానవత్వాన్ని చాటుకున్నారు.ఈ రోజు ఉదయం దేవనకొండ మండల కేంద్రంలోని యస్.సి కాలనీ నందు
రామాంజనేయులు నివాసం ఉంటున్న తన పూరి గుడిసె నిన్న షాట్ సర్క్యూట్ వల్ల దగ్ధం అవ్వడం జరిగింది.ఈ విషయం స్థానిక నాయకులు ద్వారా తెలుసుకున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం గారి ఆదేశాలు మేరకు ఈ రోజు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి, అనంతరం ఆ కుటుంబానికి పెద్ద మనసుతో స్పందించి *యువనేత గుమ్మనూరు ఈశ్వర్* మరియు గుమ్మనూరు మహేంద్ర *
20 వేలు రూపాయలు ఆర్థిక సాయమందించారు* ఈ సాయం పట్ల ఆ కుటుంబం సంతోషం వ్యక్తం చేశారు..

ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కిట్టు, మండల కన్వీనర్ కప్పట్రాళ్ల మల్లికార్జున,సర్పంచ్ గుమర్ల స్వామి,రామాంజినేయులు, ఎంపీటీసీ యూసబ్ భాష, నాయకులు రాఘవేంద్ర,మద్దిలేటి నాయుడు,రంగన్న,అశోక్,తహసీల్దార్ వెంకటేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular