Monday, November 17, 2025

చేగుంట :పేకాట రాయుళ్ళు అరెస్ట్

TEJA NEWS TV TELANGANA :
మెదక్ జిల్లా
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, విశ్వసనీయమైన సమాచారం ఆధారంగా మెదక్ జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు చేగుంట గ్రామం పరిధిలో పేకాట ఆడుతున్న వ్యక్తులపై దాడి నిర్వహించారు.
ఈ దాడిలో మొత్తం 8 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి రూ.58,060/- నగదు మరియు 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
నిందితులను మరియు స్వాధీనం చేసిన వస్తువులను చేగుంట పోలీస్ స్టేషన్‌కు అప్పగించి, కేసు నమోదు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ గారు మాట్లాడుతూ,
జూదం వంటి అక్రమ కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి అని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular