Thursday, May 22, 2025

చేగుంటలో ఘనంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు

TEJA NEWS TV TELANGANA

దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్  చెరుకు శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు చేగుంట మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, మండల కోఆర్డినేటర్  జనగామ మల్లారెడ్డి ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించారు, శనివారం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తూప్రాన్ టోల్ ప్లాజా నుండి వందల సంఖ్యలో కార్లలో చేగుంట బస్టాండ్  దగ్గరికి వచ్చి అనంతరం అక్కడనుండి ర్యాలీగా గాంధీ చౌరస్తా వరకు వెళ్లారు, కార్యకర్తలు, నాయకులు, జై కాంగ్రెస్, జై చెరుకు శ్రీనివాస్ రెడ్డి, జై శ్రీనన్న, నినాదాలు చేస్తూ వెళ్లారు, గాంధీ చౌరస్తా వద్ద చెరుకు శ్రీనివాస్ రెడ్డికి క్రేన్ సాయంతో భారీ గజమాలతో సన్మానం చేశారు, గాంధీ చౌరస్తా వద్ద భారీ కేక్ కట్ చేసి అభిమానులు, నాయకులు కార్యకర్తలు ఒకరికి ఒకరు తినిపించడం జరిగింది, జన్మదిన వేడుకల్లో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, జిల్లా నాయకులు, నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మండల నాయకులు, వివిధ గ్రామాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు కార్యకర్తలు నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు,

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular