Thursday, May 22, 2025

చండ్రుగొండ: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎమ్మెల్యే జారె

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
06-05-2025
అశ్వరావుపేట నియోజకవర్గం చండ్రుగొండ.
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎమ్మెల్యే జారె

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన “ఇందిర సౌర జలవికాసం” అనే కొత్త పథకం ప్రారంభోత్సవం సందర్భంగా, ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పోడు భూములు పొందిన రైతులు వ్యవసాయ రంగంలో అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చండ్రుగొండ మండలంలోని బెండాలపాడు గ్రామాన్ని ఎంపిక చేశారు.

ఈ సందర్భంగా ఈ నెల 10వ తేదీన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక ప్రణాళిక, విద్యుత్ శాఖల మంత్రి  భట్టి విక్రమార్క  ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి హాజరవుతున్నారు.

కార్యక్రమం విజయవంతం కావడానికి ఏర్పాట్లను ఐటిడిఏ పీవో బి. రాహుల్ , ఎంపీడీవో అశోక్ , ఎమ్మార్వో సంధ్యారాణి , సబ్ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణ ,హార్టికల్చరల్ ఆఫీసర్ స్రవంతి, ఏ ఈ నరసింహారావు,   డేవిడ్ రాజు, ఏపీ ఓ చంద్రమోహన్, ఉదయ్ కుమార్, వివిధ శాఖల అధికారులు సమన్వయం తో పనిచేయాలని  ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సూచించారు.మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సీనియర్ నాయకులు భోజ్య నాయక్, పజిల్ బక్షి, బొర్రా సురేష్, నల్లమోతు వెంకటరమణ, చుండ్రు విజయ్,  తుమ్మలపల్లి సురేష్,  కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular