భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
12-4-2025
చండ్రుగొండ మండలం (ఉదయం 8:30) — చండ్రుగొండ నుండి జూలూరుపాడ్ రోడ్ వెంబడి ప్రతి రోజు క్రికెట్ ఆడుతున్న సీనియర్, జూనియర్ ఆటగాళ్ల మధ్య అకస్మాత్తుగా అశ్వారావుపేట నియోజకవర్గ MLA జారే ఆదినారాయణ హాజరయ్యారు. గ్రౌండు లోకి తన వాహనంతో వచ్చి కొంత సేపు ఆటగాళ్లతో కలిసి బ్యాటింగ్, బౌలింగ్ చేశారు.
ఈ సందర్భంగా ఆటగాళ్లు గ్రౌండ్ లేకపోవడం వల్ల పొలాల్లో ఆడుకోవలసి వస్తోందని విన్నవించారు. గత కొంతకాలంగా సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని తెలిపారు.
MLA ఆదినారాయణ స్పందిస్తూ, తాను చదువులు, ఆటల విషయంలో అభివృద్ధికి కృషి చేస్తానని, కచ్చితంగా ప్లే గ్రౌండ్ కేటాయింపునకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. స్థానిక తహసీల్దార్తో కూడా స్థలం చూసేందుకు ఆదేశించారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోవిందరెడ్డి, NSUI అధ్యక్షుడు వసీం పాష పాల్గొన్నారు. ఆటగాళ్లలో ప్రతిభ విద్యాలయం కరెస్పాండెంట్ బాబా, RMPలు సాబిర్, పాష, ముజమ్మిల్, కాంగ్రెస్ నాయకులు షబ్బీర్, ఇమ్రాన్, ఉద్యోగులు MPO ఖాన్, సెక్రటరీ ఇజ్హర్, RTC ఉద్యోగి జలీల్, జాహిద్, బషీర్, యాకుబ్ పాషా, నరేష్, మద్దిబోయిన సీతారాములు తదితరులు ఉన్నారు.
చండ్రుగొండలో MLA ఆదినారాయణ సడెన్ క్రికెట్ సందడి
RELATED ARTICLES