
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
చండ్రుగొండ, ఆగస్టు 23.
చండ్రుగొండ మండల కేంద్రంలో గ్రంథాలయం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ను మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్నంశెట్టి మహేష్ వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ — “గ్రంథాలయం లేక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భవిష్యత్ తరాల కోసం గ్రంథాలయం అత్యవసరం” అని తెలిపారు.
కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సానుకూలంగా స్పందిస్తూ — “మండల కేంద్రంలో గ్రంథాలయ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం” అని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ నాయకులు కుక్కముడి లక్ష్మీనారాయణ, భూక్యా నరేష్, సయ్యద్ మజీద్, దారావత్ శివ, అనిరుద్, బడుగు గణేష్ తదితరులు పాల్గొన్నారు.



