Thursday, May 22, 2025

గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా షబ్బీర్ అలీ కృషి****మాందాపూర్‌లో సీసీ రోడ్డులకు రూ.15 లక్షల నిధుల మంజూరు**

బీబీపేట్ మండలంలోని మాందాపూర్ గ్రామానికి అభివృద్ధి పనుల్లో మద్దతుగా మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ కృషితో సీసీ రోడ్ల నిర్మాణానికి NREGS నిధుల నుండి రూ.15 లక్షల నిధులు మంజూరయ్యాయి.

ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలు, గ్రామ కాంగ్రెస్ పార్టీ తరఫున షబ్బీర్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుతారి రమేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజు, జిల్లా నాయకులు భూమా గౌడ్, యువజన మండల అధ్యక్షుడు మహేష్ కుమార్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు చింతకుంట రాకేష్ రెడ్డి, రోడ్డరాజు శ్రీనివాస్ గౌడ్, నరసింహులు, రాజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, బాబు తదితరులు పాల్గొన్నారు.

గ్రామ అభివృద్ధిలో భాగంగా తీసుకుంటున్న ఈ నడుక కొనసాగుతుందని నాయకులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular