ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం నందిగామ మండలం గోళ్ళముడి గ్రామం*
గోళ్ళముడి గ్రామ యస్.యం.సి.అధ్యక్షులు గా కటారపు వెంకటేశ్వరరావు (పెద్దోడు), ఉపాధ్యక్షురాలు గా సూరగాని ఉద్దండమ్మ ఏకగ్రీవం*
స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ(యస్.యం.సి) యన్.టి.ఆర్.జిల్ల నందిగామ మండలం గోళ్ళముడి గ్రామం లో స్థానిక మండల పరిషత్ ప్రాథమికొన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ(యస్.యం.సి) ఏకగ్రీవం అయ్యాయి.
కాటారపు వెంకటేశ్వరావు (పెద్దోడు), ఉపాధ్యక్షురాలుగా సూరగాని ఉద్దండమ్మ ఏకగ్రీవం అవటం జరిగింది.
పిల్లల భవిష్యత్తు కోసం పిల్లలు ఉన్నత శిఖరాలకు ఎదగడం కోసం చదువుకునే చదువులకు విద్యావేత్తలుగా ఉపాధ్యాయులు ఏ రకంగా తోడ్పడుతారో, ప్రభుత్వం ఇచ్చేటటువంటి విద్యార్థుల భవిష్యత్తు ఉన్నత శిఖరాలకు వెళ్ళేటటువంటి విధానాల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ కూడా ఉపాధ్యాయులకి విద్యార్థులకి వాళ్ల భవిష్యత్తును ఉన్నత శిఖరాలు తీర్చిదిద్దే విధానంలో భాగస్వాములు అవటం కోసం విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వం కల్పించేటటువంటి ఓ చక్కటి అవకాశాన్ని గురువారం గోళ్ళముడి గ్రామం లో MPUP. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు జరిగాయి.
స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడీగా కాటారపు వెంకటేశ్వరావు , ఉపాధ్యక్షురాలిగా సూరగాని ఉద్ధాండ్డమ్మ ను గ్రామ తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు గాడిపర్తి శ్రీనివాసరావు మరియు తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు బత్తిన రవి ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సి.హెచ్.అర్జునరావు,
ప్రధానోపాధ్యాయులు ఆరేపల్లి బిక్షాలు, షేక్.నవాబ్ జాని,బొడ్డు వెంకటరమణ,అన్నాబత్తుల సత్యన్నారాయణ విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.