Wednesday, January 22, 2025

గుంటూరు జిల్లా పెదకాకానిలో ఘటన
.. ప్రేమజంట ఆత్మహత్య

ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ రిపోర్టర్



గుంటూరు జిల్లా పెదకాకానిలో ఘటన

  ప్రేమజంట ఆత్మహత్య

  మరో చరిత్ర

గుంటూరు (పెదకాకాని), గుంటూరు జిల్లా పెదకాని మండల రైల్వే స్టేషన్ సమీపంలో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనం సృష్టిస్తోంది.  వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.  మండల కేంద్రమైన పెదకాకాని గ్రామంలో గల దానబోయిన సాంబశివరావు చిన్న కుమారుడు దానబోయిన మహేష్ (22), కృష్ణాజిల్లా నందిగామ మండలం పరిధిలోని రుద్రవరం గ్రామానికి చెందిన నండూరు వెంకయ్య కుమార్తె నండూరు శైలజ హైదరాబాదు నగరంలో ప్రముఖ సెల్ ఫోన్ కంపెనీలో ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు.

ఈ విధంగా ఇద్దరు పరిచయం ప్రేమగా మారింది.  వీరి ప్రేమ విషయం తెలిసిన యువకుడి కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించారు.  యువతి కుటుంబ సభ్యులు మాత్రం పెళ్లికి నిరాకరించారు.  గత పది రోజుల క్రితం అమ్మాయి తల్లి నందిగామ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. అబ్బాయి తండ్రి దానబోయిన సాంబశివరావుని నందిగాం పోలీస్ స్టేషన్ వారు విచారించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular