ఖమ్మం, కోదాడ, ముదిగొండ, రత్నవరం, సింగవరం, వెంకటాపురం పట్టణ ప్రాంత గ్రామ ప్రాంతాల కి చెందిన శ్రీ మణికంఠ కోలాట భజన బృందాలు,
సాంస్కృతిక కళలు కనుమరుగవుతున్న నేపథ్యంలో మహిళలు, యువతులు కోలాటంపై ఆసక్తి పెంచుకుంటున్నారు. పండుగలు, శుభకార్యాల్లో ప్రదర్శన లిస్తూ ఆకట్టుకుంటున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా పలుప్రాంతాల్లో ఈ కళను నేర్చుకుంటున్నారు. పాశ్చాత్య దేశాల సంప్రదాయాలను డిజే సంస్కృతిని వంట పట్టించుకుంటున్న నేపథ్యంలో సాంస్కృతిక జానపద కళపై ఆసక్తి పెరగడం శుభపరిణామమని కళాప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన దేశ సాంస్కృతిక నృత్యాలు, కోలాటం లాంటి కళలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక వ్యాయామం ఆరోగ్యకరమైన జనజీవన స్రవంతి ఆనందంగా కళలు ఉంటాయని చెబుతున్నారు. వాటికి పూర్వవైభవం తీసుకురావడం ఎంతో అవసరమంటున్నారు. నేటితరానికి అవన్నీ పరిచయం చేసి ఆసక్తి కలిగేలా ప్రభుత్వము ప్రాచూర్యము చేయాలని కోరుకుంటున్నారు
కోదాడ జగ్గయ్యపేట ఖమ్మం శ్రీ మణికంఠ జానపద నవయుగ కోలాట భజన బృందం
కోలాటమాడుతున్న మహిళలు
RELATED ARTICLES