భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
12-06-2025
గుజరాత్లోని అహ్మదాబాద్ సమీపంలో ఈరోజు జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ శ్రీమతి కాపు సీతాలక్ష్మి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ ప్రమాదంలో 169 మంది భారతీయులు, 53 మంది ఇంగ్లాండ్ పౌరులు, 7 మంది పోర్చుగల్ దేశస్తులు, ఒక కెనడియన్ పౌరుడు, అలాగే 12 మంది విమాన సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరం అని ఆమె పేర్కొన్నారు.
ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు సహనశక్తిని ప్రసాదించాలని కోరుతూ ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కొత్తగూడెం:విమాన ప్రమాదం ఘటన పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కాపు సీతాలక్ష్మి
RELATED ARTICLES