ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర గ్రామంలో విద్యుత్ షాక్ ఘటన చోటుచేసుకుంది. నందిగామ నుంచి కంచికచర్లకు వెళ్తున్న 33 కె.వి విద్యుత్ లైన్ ప్రమాదవశాత్తు నాగరత్నం ఇంటి వద్ద చెక్క సెంట్రింగ్ పనుల సమయంలో ఇంటి పైభాగానికి తగలడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మధిర మండలం మాటూరు గ్రామానికి చెందినవారు. ఘటన అనంతరం స్థానికులు అప్రమత్తమై వెంటనే కీసర టోల్ ప్లాజా అంబులెన్స్ సాయంతో ఆయనను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం మధుర ఐ కేర్ ఆసుపత్రికి తరలించారు.
గ్రామస్థులు విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఈ తరహా ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
**కీసర గ్రామంలో విద్యుత్ షాక్తో వ్యక్తి గాయాలు**
RELATED ARTICLES



