Wednesday, January 22, 2025

కార్మికుల రక్తాన్ని త్రాగుతున్న  ప్రభుత్వాలను కుల్చండి-IFTU




వరదయ్య పాలెం మే 1, తేజన్యూస్ టీవీ

వరదయ్య పాలెం మండలంలో  బస్ స్టాండ్ వద్ద ఐ ఎఫ్ టీ యు  కార్యకర్తలు 138 వ మే డే ను ఘనంగా జరిపారు , ఐ ఎఫ్ టీ యు నాయకులు బుర్రా కృష్ణమూర్తి   జెండా ను ఆవిష్కరించారు,
ఈ సందర్భంగా భారత కార్మిక సంఘాల ఐక్యత (ఐ ఎఫ్ టీ యు) నాయకులు బుర్రా కృష్ణమూర్తి  మాట్లాడుతూ కార్మిక చట్టాలను హక్కులకు వ్యతిరేకంగా   పాలక వర్గాలను అనుసరిస్తున్న విధానాలను అరికట్టాలని , కార్మికుల  మీద జరుగుతున్నటువంటి అన్యాయాలను అరికట్టాలని  నేడు కార్మిక కష్టంతో ఏర్పరుచు కున్నటువంటి దేశ సంపదను జాతీయ సంపదను  ప్రభుత్వ ఆస్తులను కూడా  ప్రవేటి కరించడం, కార్మికులు పోరాటాలు చేసి తెచ్చుకున్నటువంటి హక్కులను, చట్టాలను, భద్రతను,  నేడు కేంద్ర రాష్ట్రాలు కాల రాస్తున్నాయి.దీన్ని  ప్రతిగనించి  కార్మిక చట్టాలను మార్చకుండా కార్మికులకు భద్రతను కల్పిస్తూ  వారి భవిషత్తు కొరకు పోరాడాల్సిన అవసరం ఈ కార్మిక  వర్గాలకు ఉంది, కానీ కార్మిక  వర్గాలు చిన్న చిన్న అవకాశాలు కార్మికులకు ఇస్తూ పెద్ద అవకాశాలను కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా మారుస్తు ప్రజలకు అన్యాయం చేస్తున్నారు , లక్షల కోట్ల రూపాయల సంపన్నులకు కార్పొరేట్ సంస్థలకు ఇస్తూ  కేవలం ఒక లక్ష కోట్ల రూపాయలు మాత్రమే  140 కోట్ల మంది ప్రజలకు ఇచ్చి  కార్పొరేట్ సంస్థలకు మాత్రం 12  లక్షల కోట్లు  రూపాయలు సబ్సిడీ కింద  సాకర్యాలను సమకూర్చాయి , కాబట్టి కార్పొరేట్ సంస్థల కొరకు పని చేసే ప్రభుత్వాలను మనుగడలోనుంచి తొలగించాలని  ఈ సందర్భంగా మాట్లాడారు  మరియు అన్నదాన కార్యక్రమం కూడా జరిపారు ,

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular