Saturday, January 18, 2025

ఏకగ్రీవంగా శ్రీ అన్నమయ్య ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

TEJA NEWS TV: ఏకగ్రీవంగా శ్రీ అన్నమయ్య ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక..

అధ్యక్షులుగా ఇండ్లూరి చిన్న వెంకటరెడ్డి..

ప్రధాన కార్యదర్శిగా బచోటి భాస్కర్

రాజంపేట :

మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం సభా భవనం నందు శ్రీ అన్నమయ్య ప్రెస్ క్లబ్ ప్రతినిధుల సమావేశాన్ని సోమవారం క్లబ్బు మాజీ అధ్యక్షుడు జంబు సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. సమావేశం అనంతరం జంబు సూర్యనారాయణ అధ్యక్షతన నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీ అన్నమయ్య ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులుగా ఇండ్లూరి చిన్న వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులు గా దార్ల శ్రీనివాసులు ఆచారి, పాబోలు ప్రకాష్, ప్రధాన కార్యదర్శిగా బచోటి భాస్కర్, కార్యదర్శులు గా తుపాకుల సురేష్, బత్తిన రామసుబ్బారెడ్డి,షేక్ అలీ షేర్, కోశాధికారి జి.వి.పి.ఆర్.కె రాయల్, సహాయ కార్యదర్శులు గా ఏం ఓబులేసు, మందా శివయ్య, కళాంజలి కళ్యాణ్, కార్యనిర్వాహక కార్యదర్శులుగా ద్వారకా గోపీనాథ్,కూరాకు శ్రీనివాసులు, ప్రచార కార్యదర్శులు గా నామా హరినాథ్, బి.సునీల్, సి.వెంకటేశ్వర రాజు, కార్యవర్గ సభ్యులు గా కే.వీ సుబ్బయ్య, నరసింహులు, పి.దుర్గయ్య టీ.చంద్రశేఖర్, పి.దివాకర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా నూతన కార్యవర్గ నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామని తెలిపారు. జర్నలిస్టులు ఐకమత్యంతో వ్యవహరించి హక్కుల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular