Thursday, May 22, 2025

ఎల్కతుర్తి సభాస్థలి సందర్శించిన వనమా రాఘవ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

తేజ న్యూస్ టీవీ
25-04-2025


బీఆర్ఎస్ రజతోత్సవం సభ ఏర్పాట్లను సమీక్షించిన నాయకులు

వరంగల్ జిల్లా ఎల్కతుర్తి సభాస్థలిని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీ వనమా రాఘవ  శుక్రవారం మధ్యాహ్నం సందర్శించారు. ఆయనతో  బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు శ్రీ వద్దిరాజు రవిచంద్ర , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు పాల్గొన్నారు.

ఈనెల 27వ తేదీన బీఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగా జరగనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, మెచ్చా నాగేశ్వరరావు, హరిప్రియ నాయక్, జాజాల సురేందర్, దిండిగాల రాజేందర్, కాపు సీతా మహాలక్ష్మి, భద్రాచలం నియోజకవర్గ ఇంఛార్జి రామకృష్ణ తదితరులతో కలిసి పరిశీలించారు.

సభకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం నియోజకవర్గం నుంచి వాహనాల రాకపోకల మార్గాలను, పార్కింగ్ స్థలాలను, తిరుగు ప్రయాణ ఏర్పాట్లను ఎంపీ రవిచంద్ర మ్యాప్ ద్వారా సమగ్రంగా వివరించారు. మ్యాప్ ప్రతులను నాయకులు, సమన్వయకర్తలకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో పాల్వంచ టౌన్ BRS అధ్యక్షులు మంతపురి రాజు గౌడ్, డిష్ నాయుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ వేల్పుల దామోదర్, ఉర్దూఘర్ మాజీ ఛైర్మన్ అన్వర్ పాషా, మాజీ కౌన్సిలర్లు అంబుల వేణు, రుక్మాందర్ బండారి, వేముల ప్రసాద్, దూడల కీరణ్, నవతన్, కంచర్ల రామారావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular