Wednesday, February 5, 2025

ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం చింతలపాడు గ్రామంలో వర్షానికి తడిసిన పంటలను పరిశీలించిన రమాదేవి

ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం/కంచి చర్ల మండలం

రైతు కష్టం పట్టించుకునే నాధుడే లేడా అని ప్రశ్నించిన :- జనసేన పార్టీ సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి. ప్రతి ఎకరాకు రైతుకు కనీసం ప్రభుత్వం యాభై వేలు పరిహారం అందివ్వాలి.

ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం చింతలపాడు గ్రామంలో వర్షానికి తడిసిన పంటలను పరిశీలించిన రమాదేవి….

గత రెండు మూడు రోజుల నుంచి కురిసిన నందిగామ నియోజకవర్గంలో చేతికొచ్చిన పంటలు నీట మునిగాయని రైతు కష్టం ప్రభుత్వానికి కనిపించదా అని ప్రశ్నించిన రమాదేవి….

మిర్చి కవులు రైతు ఎకరాకి సుమారు రెండు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారని అకాల వర్షం కారణంగా పంట తడిసి తీవ్ర నష్టం వాటిల్లిందని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేసిన రమాదేవి.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్ వడ్డెల్లి, నందిగామ 20 వ వార్డు సభ్యులు తాటి వెంకట కృష్ణ,తెప్పలి కోటేశ్వరరావు, తాళ్ళపల్లి నాగరాజు,వీరబాబు, వెంకట నరసమ్మ పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular