అహోబిల మఠం 46 వ పీఠాధిపతి శ్రీ వన్ శఠగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి శనివారం తెల్లవారుజామున అహోబిలం చేరుకున్నారు. ఆయనకు ప్రధానార్చకులు కీడాంబి వేణుగోపాల్ స్వామి, మణియార్ సౌమ్యనారాయణ, వైకుంఠన్ వేద పండితుల బృందం పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈనెల 3 నుండి క్షేత్రంలో జరగనున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు చెన్నై నుండి విచ్చేశారు.