Monday, January 20, 2025

అభివృద్ధి కార్యక్రమాలపై తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో ప్రధాన సమస్య చంద్రుగొండ నుండి జూలూరుపాడు రోడ్డు డ్రైనేజీ 30 అడుగుల కు మార్కింగ్ చేయాలని అధికారుల ను ఆదేశించారు ఇండ్లు తొలగించాల్సి వస్తే సుమారు ఎన్ని ఇండ్లు తొలగించాల్సి వస్తుందో అధికారులు వెంటనే రిపోర్ట్ పంపించాలని ఆదేశించారు
అలాగే వెంగళరావు ప్రాజెక్ట్ తాత్కాలిక మరమ్మత్తులు కొరకు డి ఈ వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక పంపించాలన్నారు భారీ వర్షాల కారణంగా సీజన్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది మందులు అందుబాటులో ఉంచుకోవాలని డాక్టర్ తనుజ కు సూచించారు. ఎస్టీ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినిలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉచిత విద్యుత్ బిల్లులు ప్రభుత్వ సబ్సిడీ గ్యాస్ ఇస్తున్న పథకాల గురించి మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సంధ్యారాణి, ఎండిఓ బి. అశోక్, ఎస్సై జి స్వప్న, డాక్టర్ తనూజ, సూపర్డెంట్ శ్రీనివాస చార్యులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోవిందరెడ్డి, సీనియర్ నాయకులు బొజ్జ నాయక్ ,,కొనగళ్ళ వెంకటరెడ్డి, అంకిరెడ్డి కృష్ణారెడ్డి, తుమ్మలపల్లి సురేష్, సారేపల్లి శేఖర్, వారధి సత్యనారాయణ, చాపల మడుగు లక్ష్మణరావు, ఎన్ ఎస్ యు మండల అధ్యక్షుడు వసీం పాషా, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular