భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
చండ్రుగొండ : ములుగు ఫారెస్ట్ కాలేజీ (ఎఫ్సీఆర్ఐ) నాలుగో సంవత్సరం విద్యార్థులు చండ్రుగొండ రేంజ్ పరిధిలోని అడవులను ఐదు రోజులపాటు అధ్యయనం చేస్తున్నారు. మొక్కలు, చెట్లు, వన్యప్రాణులు, చెక్డ్యాములు, చెరువులు, నీటి కుంటలు, జలాశయాలు తదితర అంశాలపై పరిశీలన జరుపుతున్నారు. రేంజర్ సిహెచ్ ఎల్లయ్య సిబ్బందితో కలిసి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.




